Share News

Hyderabad: ఆదిభట్ల ఔటర్ రింగ్ రోడ్‌పై దారుణం..

ABN , First Publish Date - 2023-11-26T11:36:55+05:30 IST

హైదరాబాద్: ఆదిభట్ల ఔటర్ రింగ్ రోడ్‌పై దారుణం జరిగింది. కారులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి సజీవదహనం అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కారు నల్గొండ జిల్లా, కోదాడకు చెందిన వ్యక్తిదిగా గుర్తించారు.

Hyderabad: ఆదిభట్ల ఔటర్ రింగ్ రోడ్‌పై దారుణం..

హైదరాబాద్: ఆదిభట్ల ఔటర్ రింగ్ రోడ్‌పై దారుణం జరిగింది. కారులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి సజీవదహనం అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కారు నల్గొండ జిల్లా, కోదాడకు చెందిన వ్యక్తిదిగా గుర్తించారు. సజీవదహనం అయిన వ్యక్తి వెంకటేష్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసులు కారు నెంబర్ ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. శనివారం సాయంత్రం వెంకటేష్ కోదాడ నుంచి హైదరాబాద్ బయలుదేరాడు. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో కారు నిలిపి ఉన్న సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. కారులో ఉన్న ఆయన సజీవ దహనమయ్యాడు. కారును ఎవరైనా తగలబెట్టారా? లేక ప్రమాదవశాత్తు తగలబడిందా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ప్రమాద ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది.

Updated Date - 2023-11-26T11:36:59+05:30 IST