Share News

KTR: ధరణితో ఎవరికీ నష్టం జరగదు

ABN , First Publish Date - 2023-11-25T17:45:59+05:30 IST

కొడంగల్‌లో చెల్లని రూపాయి.. కామరెడ్డిలో గెలుస్తుందా?, రేవంత్ రెడ్డికి కామారెడ్డిలో 3వ స్థానమే. రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో ఉద్యమాల గడ్డ కామారెడ్డిపై నీ కథలు సాగవు.

KTR: ధరణితో ఎవరికీ నష్టం జరగదు

కామారెడ్డి: కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులా కామారెడ్డికి కేసీఆర్ (Cm Kcr) వస్తున్నారని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. భిక్కనూరు రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ‘‘కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తీసుకువచ్చారు. 14 సంవత్సరాలు ఢిల్లీ గద్దలతో కొట్లాడి తెలంగాణ తీసుకువచ్చారు. భూములు అమ్ముకునేందుకే కేసీఆర్ వస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కామారెడ్డిలో ఒక ఇంచు భూమి కూడా పోదు. డిసెంబర్ 3 తర్వాత అసైన్డ్ భూములపై పూర్తి అధికారాన్ని ఇస్తాం. గెలిచేది కేసీఆరే.. మీరే తప్పకుండా కేసీఆర్‌ను గెలిపిస్తారు. ఐదు సంవత్సరాల్లోనే కామారెడ్డిని భారత దేశంలోనే నెంబర్ వన్ చేస్తాం. బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లే వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం. భారత దేశంలో ఎక్కువ వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ. అందుకే సన్న బియ్యం ఇస్తాం.’’ అని తెలిపారు.

‘‘కొడంగల్‌లో చెల్లని రూపాయి.. కామరెడ్డిలో గెలుస్తుందా?, రేవంత్ రెడ్డికి కామారెడ్డిలో 3వ స్థానమే. రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో ఉద్యమాల గడ్డ కామారెడ్డిపై నీ కథలు సాగవు. డిసెంబర్ 3 నాడు కామారెడ్డి సత్తా ఏమిటో తెలుస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు వద్దంటున్నారు. ఒక్క ఇంచు భూమి ఎక్కడికి పోదు... నాది గ్యారంటీ. కేసీఆర్ గెలిస్తే ఢిల్లీలో జెండా పాతుతారు.’’ అని కేటీఆర్ వెల్లడించారు.

Updated Date - 2023-11-25T17:46:03+05:30 IST