అసెంబ్లీలో భజన బ్యాచ్ ఎక్కువైపోయిందన్నారు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు బాధాకరంగా ఉందన్నారు.
Telangana: ఎంతో కాలంగా రైతులు ఎదురు చూస్తున్న రుణమాఫీ ఈరోజు సాయంత్రానికి ప్రారంభంకానుంది. దాదాపు లక్ష వరకు ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఈ సందర్భంగా మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఏబీఎన్తో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణాలు మాఫీ చేయడంఅభినందనీయమన్నారు.
నిజామాబాద్ జిల్లా: నవీపేట్ మండలంలోని విషాదం నెలకొంది. ఫక్రాబాద్ రూల్ పట్టాలపై బార్యా భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు పొత్తంగల్ మండలంలోని హెగ్డోలీ గ్రామానికి చెందినవారు. అనీల్, శైలజ అనే దంపతులు చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసి బంధువులకు కోటగిరి పోలీసులకు పంపించారు.
Telangana: జిల్లాలోని బిక్కనూరు మండలం సిద్దరామేశ్వరనగర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కామారెడ్డి జిల్లా: పల్వంచ మండలం, భవానిపేట గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి అనే వ్యక్తి సైబర్ వలలో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సైబర్ కేటుగాళ్లు వెంకట్ రెడ్డికి ఫోన్ చేశారు. అమెరికాలో ఉంటున్న మీ కుమార్తె మాధవి ఆపదలో ఉందని.. బెదిరింపు కాల్ చేశారు. ఆమె ఉంటున్న గదిలో మరో అమ్మాయి హత్యకు గురైందంటూ ఈ కేసు నుంచి మీ కూతురును తప్పించాలంటే రెండు లక్షలు ఖర్చవుతుందని, డబ్బులు పంపాలంటూ ఫోన్ చేశారు.
మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. నిజామాబాద్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నిజామాబాద్ బైపాస్ రోడ్డులోని వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
D Srinivas Passes Away : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీ శ్రీనివాస్(Dharmapuri Srinivas) భౌతిక కాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నివాళులర్పించారు. ఆదివారం ఉదయం నిజామాబాద్లోని(Nizamabad) డీఎస్ నివాసానికి చేరుకున్న సీఎం రేవంత్.. ఆయన పార్థీవదేహాన్ని సందర్శించారు. నివాళులర్పించి..
బాన్సువాడ(Banswada) మండలం తిర్మలాపూర్(Tirmalapur)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త రాములును మామ నారాయణతో కలిసి భార్య మంజుల హత్య చేసింది. గొడ్డలితో దారుణంగా నరికి చంపి ఇంటి వెనక గోతిలో పాతిపెట్టారు.
కామారెడ్డి: జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. బీబీపేట మండల కేంద్రానికి చెందిన వీణ(35) అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వీణకు సిద్దిపేటకు చెందిన శ్రావణ్ కుమార్తో 2015లో వివాహం జరిగింది.
తెలంగాణను(Telangana) సాధించిన పార్టీ.. అప్రతీహతంగా పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన పార్టీ బీఆర్ఎస్కు(BRS) గడ్డుకాలం నడుస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు.. ఆ పార్టీ ఉనికినే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మార్చేశాయి. 39 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా.. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.