Share News

HANDRINIVA : హంద్రీనీవా కాలువ గండికి మరమ్మతులు

ABN , Publish Date - Sep 06 , 2024 | 12:18 AM

జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి హం ద్రీనీవా కాలువ ద్వారా గొ ల్లపల్లి రిజర్వాయర్‌కు నీ రు విడుదల చేయడంతో హంద్రీనీవా కాలువ గం డికి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని టీడీపీ నాయకుడు వెంక టేశ్వర్‌రావు హెచఎనఎస్‌ అధికారులకు సూచించారు. మండలంలోని కోనాపురం సమీపంలో మడకశిర బ్రాంచ కెనాల్‌ ఎల్‌-5 వద్ద వైసీపీ పాలన లో హంద్రీనీవా కాలువకు పడిన గండి టీడీపీ నాయకులు, హెచఎనఎస్‌ అధికారులు గురువారం పరిశీలించారు. గండిపడిన ప్రదేశం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మరమ్మతు పనులు ప్రారంభించారు

HANDRINIVA : హంద్రీనీవా కాలువ గండికి మరమ్మతులు
Venkateshwar Rao is starting the work after worshiping

పెనుకొండ రూరల్‌, సెప్టెంబరు 5 : జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి హం ద్రీనీవా కాలువ ద్వారా గొ ల్లపల్లి రిజర్వాయర్‌కు నీ రు విడుదల చేయడంతో హంద్రీనీవా కాలువ గం డికి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని టీడీపీ నాయకుడు వెంక టేశ్వర్‌రావు హెచఎనఎస్‌ అధికారులకు సూచించారు. మండలంలోని కోనాపురం సమీపంలో మడకశిర బ్రాంచ కెనాల్‌ ఎల్‌-5 వద్ద వైసీపీ పాలన లో హంద్రీనీవా కాలువకు పడిన గండి టీడీపీ నాయకులు, హెచఎనఎస్‌ అధికారులు గురువారం పరిశీలించారు.


గండిపడిన ప్రదేశం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మరమ్మతు పనులు ప్రారంభించారు. ఈ సందర్బంగా వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ... వైసీపీ పాలనలో 2023లో బీఎల్‌ఆర్‌ ప్రాజెక్ట్‌వారు నాశిరకంగా పనులు చేయడంతో హంద్రీనీవా కాలుకు గం డిపడిందన్నారు. రైతులపక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు మరమ్మతులకు రూ.9లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి హంద్రీనీవా కాలువ ద్వారా ప్రతి చెరువుకు నీరంది స్తామన్నారు. ఈ కార్యక్రమంలో హెచఎనఎస్‌ డీఈ రామచంద్రమూర్తి, ఏఈ చౌడయ్య, నాయకులు మాజీ ఎంపీటీసీ సుబ్రహ్మణ్యం, ప్రభాస్‌, త్రివేంద్ర, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 06 , 2024 | 12:18 AM