Share News

Kandula Durgesh: మాజీ సీఎం జగన్‌పై మంత్రి కందుల దుర్గేశ్ సెటైర్లు

ABN , Publish Date - Aug 21 , 2024 | 08:37 PM

ఋషికొండపై భవనాలు ఒక పేదవాడు కట్టుకున్న చిన్న పూరి గుడిసె అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌పై మంత్రి కందుల దుర్గేశ్ వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఆ ఋషికొండ భవనాలను ఏం చేయాలో ఇంకా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ భవనాల నిర్మాణం కోసం గత పాలకులు ప్రజాధనాన్ని దుర్మార్గంగా ఖర్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kandula Durgesh: మాజీ సీఎం జగన్‌పై మంత్రి కందుల దుర్గేశ్ సెటైర్లు

విశాఖపట్నం, ఆగస్ట్ 21: ఋషికొండ భవనాలపై పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ బుధవారం విశాఖపట్నంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఋషికొండపై భవనాలు ఒక పేదవాడు కట్టుకున్న చిన్న పూరి గుడిసె అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌పై వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఆ ఋషికొండ భవనాలను ఏం చేయాలో ఇంకా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ భవనాల నిర్మాణం కోసం గత పాలకులు ప్రజాధనాన్ని దుర్మార్గంగా ఖర్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Mangalagiri: ముగిసిన విచారణ.. మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన జోగి రమేశ్

Also Read: KTR: తప్పుంటే.. దగ్గరుండి ఫామ్ హౌస్ కూలగొట్టిస్తా


ఋషికొండ బీచ్‌కి బ్లూ ఫ్లాగ్ అవార్డు వచ్చిందన్నారు. ఈ బీచ్‌ను మరింతగా అభివృద్ధి పరుస్తామని ఆయన స్పష్టం చేశారు. విశాఖపట్నంలో సినిమా రంగానికి మంచి అవకాశాలున్నాయన్నారు. అత్యధిక సినిమా షూటింగులు విశాఖలోని జరుగుతున్నాయని గుర్తు చేశారు. సినీ రంగానికి చెందిన ఒక బృందం త్వరలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలవనున్నారని తెలిపారు. అలాగే రాష్ట్రంలో సినీరంగం అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టినట్లు వివరించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త్వరలోనే విశాఖలో పర్యటిస్తారని చెప్పారు. ఆగస్ట్ 22వ తేదీ.. మెగాస్టార్ చిరంజీవి జన్మదినం. ఈ సందర్భంగా చిరంజీవికి కందుల దుర్గేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: supreme court judgement: వైయస్ జగన్‌కి సుప్రీంకోర్టు చెంపదెబ్బలు

Also Read: West Bengal horror: కోల్‌కతాలో కొనసాగుతోన్న హర్రర్ సీన్స్..


అంతకు ముందు..

విశాఖపట్నంలోని విఎమ్ఆర్డిఏలో మంత్రి కందుల దుర్గేష్ ఉన్నతసాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి మూడు జిల్లాలపై సమీక్ష నిర్వహించామని చెప్పారు. గత ఐదేళ్లలో పర్యాటక రంగాన్ని వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. పర్యాటక రంగాల్లోని సమస్యలను అధ్యయనం ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే పర్యావరణ హితమైన టూరిజాన్ని అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. టెంపుల్ టూరిజం, వెల్నెస్ టూరిజం, ఎకో టూరిజంతో సర్క్యూట్లని ఏర్పాటు చేస్తామని చెప్పారు. హెలి టూరిజాన్ని కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.

Also Read: Shahjahan: పాపం.. షాజహాన్ కథ వింటే కన్నీళ్లాగవు

Also Read: తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ‘హైడ్రా’ (వెబ్ స్టోరీ)

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Aug 21 , 2024 | 09:14 PM