Share News

Merugu Nagarjuna: కాంగ్రెస్‌లో షర్మిల చేరినంత మాత్రాన...

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:29 AM

Andhrapradesh: తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి మేరుగ నాగార్జున శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ఎవరు ఏ పార్టీలో చేరినా తమకేమీ కాదన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్‌‌లో ఏమీ కాదన్నారు.

Merugu Nagarjuna: కాంగ్రెస్‌లో షర్మిల చేరినంత మాత్రాన...

తిరుమల, జనవరి 5: తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి మేరుగ నాగార్జున (Minister Merugu Nagarjuna) శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ఎవరు ఏ పార్టీలో చేరినా తమకేమీ కాదన్నారు. షర్మిల (YS Sharmila) కాంగ్రెస్ పార్టీలో (Congress) చేరినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్‌‌లో (Andhrapradesh) ఏమీ కాదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) వల్లే కానిది ఎవరివల్ల అవుతుందని ప్రశ్నించారు. తమ పార్టీకి నష్టం ఏమి లేదని అన్నారు. టికెట్ల విషయములో ఎవరికి అసంతృప్తి లేదన్నారు. తమ పార్టీలో టికెట్లు ఎవరికి ఇచ్చుకుంటే చంద్రబాబుకు ఏం సంబంధమని మంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 05 , 2024 | 11:29 AM