Home » Chittoor
తిరుపతిలో మోహన్బాబు కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ కాలేజీకి వస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది కాలేజీ గేట్లు మూసివేసి ఎవరినీ లోపలకు రాకుండా కట్టుదిట్టం చేశారు. మీడియాను కూడా అక్కడ నుంచి వెళ్లిపోవాలని భద్రతా సిబ్బంది హుకుం జారీ చేసింది. మనోజ్ రాకపై అలర్ట్ అయిన పోలీసులు.. భద్రతా కట్టుదిట్టం చేశారు.
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులు క్యూ లైన్లలో నిలుచుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ నెల 19వ తేది వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. మరోవైపు తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకేన్ల జారీ కొనసాగుతోంది.
భారతదేశంలో 64 లక్షల పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పెన్షన్ల కోసం ఏటా రూ.33 వేల కోట్లు ప్రజలకు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. హెల్దీ, వెల్దీ, హ్యాపీ సొసైటీ అనేవే కూటమి ప్రభుత్వ లక్ష్యాలని సీఎం చెప్పారు. పేదరికం, ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్: ఈ ఏడాది గోదావరి, కృష్ణా నదీ జలాలు దాదాపు 6వేల టీఎంసీలు సముద్రంలో వృథాగా కలిసిపోయాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రజలు వాటిలో కేవలం 350 టీఎంసీలు మాత్రమే వాడుకోగలిగారని చంద్రబాబు చెప్పారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనలో టీటీడీ తప్పిదం లేకపోయినప్పటికీ పాలకమండలి తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచనలను స్వీకరిస్తున్నట్లు బీఆర్ నాయుడు చెప్పారు.
వైకుంఠ ద్వార దర్శన టికెట్స్ కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతిచెందడం బాధాకరమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు(MLA Arani Srinivasulu) అన్నారు. తొక్కిసలాటలో గాయపడి పద్మావతి మెడికల్ కాలేజిలో చికిత్స పొందుతున్న భక్తులను ఆయన గురువారం పరామర్శించారు.
ముక్కోటి ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు చేసే ఉపవాసం 24 ఏకాదశి ఉపవాసాలతో సమానమని శాస్త్ర పండితులు స్పష్టం చేస్తున్నారు. అందుకే ఈ రోజు ఉపవాసం ఉండడం వల్ల ముక్తి ప్రసాదిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ రోజు సాయంకాలం సంధ్యా సమయంలో పూజ చేయాలి. రాత్రి జాగరణ చేయాలి. జాగారం చేసేటప్పుడు భగవంతుని కీర్తనలు, భాగవత కధలు, హరికథా కాలక్షేపంతో జాగరణ చేస్తే..
తిరుమల తిరుపతి దేవస్థానాల చరిత్రలోనే కనీవినీ ఎరుగని విషాదం చోటుచేసుకుంది.
Tirupati stampede: తిరుపతి తొక్కిసలాటలో గాయపడిన వారిని టీటీడీ ఈవో శ్యామలారావు పరామర్శించారు. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందారని.. దాదాపు 41 మంది గాయపడ్డారన్నారు. ఘటనకు కారణం ఏంటనేది విచారిస్తున్నామని తెలిపారు.
తిరుమల: వైకుంఠ ద్వారా దర్శనం కోసం ఈ నెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేసిన ఎస్డి టోకెన్స్ కోటా పూర్తి అయింది. మూడు రోజులకు సంబంధించి లక్షా 20 వేల టోకెన్స్ని టీటీడీ అధికారులు జారీ చేశారు. దాదాపు 13 గంటల పాటు 9 కేంద్రాల్లో భక్తులకు టోకెన్స్ జారీ చేశారు.