Share News

పవన్‌ దీక్షకు సంఘీభావం

ABN , Publish Date - Sep 25 , 2024 | 12:29 AM

అన్నవరం, సెప్టెంబరు 24: తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ చేపడుతున్న ప్రాయశ్చిత్త దీక్షకు అన్నవరంలో సత్యదేవుడి తొలిపావంచా వద్ద నియోజకవర్గ జనసేన నాయకులు వరుపుల తమ్మయ్యబాబు ఆధ్వర్యంలో జనసైనికులు సంఘీబావం తెలిపారు. తొలిపావంచా వ

పవన్‌ దీక్షకు సంఘీభావం
సత్యదేవుడి తొలిపావంచా వద్ద కాగడాలతో తమ్మయ్యబాబు, జనసైనికులు

అన్నవరం, సెప్టెంబరు 24: తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ చేపడుతున్న ప్రాయశ్చిత్త దీక్షకు అన్నవరంలో సత్యదేవుడి తొలిపావంచా వద్ద నియోజకవర్గ జనసేన నాయకులు వరుపుల తమ్మయ్యబాబు ఆధ్వర్యంలో జనసైనికులు సంఘీబావం తెలిపారు. తొలిపావంచా వద్ద టెంకాయికొట్టి కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. తమ్మయ్యబా బు మాట్లాడుతూ గతపాలకులు టీటీడీని భ్రష్టుపట్టించారని, హిందువుల మనోభావాలకు విఘాతం కలిగేలా వ్య వహరించారని, వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమా ండ్‌ చేశారు. జనసైనికులు బండారు రామారావు, వరుపుల సాయికిరణ్‌, నల్లల రామకృష్ణ, కరణం సుబ్రహ్మణ్యం, గాబు సుభాష్‌, నవుడు నూకరాజు పాల్గొన్నారు.

Updated Date - Sep 25 , 2024 | 12:29 AM