Share News

CPI Narayana: ఊళ్లకు ఊళ్లే దోచేసిన.. ఇక రోజాను భరించే శక్తి నగరికి లేదు

ABN , Publish Date - May 09 , 2024 | 01:48 PM

నగిరి నియోజకవర్గాన్ని దోచేసిన మంత్రి రోజాను ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు సీపీఐ జాతీయ నేత నారాయణ పిలుపునిచ్చారు. ఇవాళ తిరుపతిలో నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. నగిరిలో రోజా ఊళ్లకు ఊళ్లే దోచేసిందన్నారు. ఇష్టారాజ్యంగా ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ రవాణాతో నగిరి నియోజకవర్గాన్ని పూర్తిగా దోచేసిందని అన్నారు. నగిరిలో మంత్రి రోజా పాలనలో దౌర్జన్యాలు, అరాచకాలు, అవినీతి ఎక్కువైందన్నారు.

CPI Narayana: ఊళ్లకు ఊళ్లే దోచేసిన.. ఇక రోజాను భరించే శక్తి నగరికి లేదు

తిరుపతి: నగిరి నియోజకవర్గాన్ని దోచేసిన మంత్రి రోజా (Minister Roja)ను ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు సీపీఐ జాతీయ నేత నారాయణ పిలుపునిచ్చారు. ఇవాళ తిరుపతిలో నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. నగిరిలో రోజా ఊళ్లకు ఊళ్లే దోచేసిందన్నారు. ఇష్టారాజ్యంగా ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ రవాణాతో నగిరి నియోజకవర్గాన్ని పూర్తిగా దోచేసిందని అన్నారు. నగిరిలో మంత్రి రోజా పాలనలో దౌర్జన్యాలు, అరాచకాలు, అవినీతి ఎక్కువైందన్నారు. రాజకీయ కక్ష సాధింపులు పరాకాష్టకు చేరాయన్నారు. ఇకపై నగిరి ప్రజలకు మంత్రి రోజాని భరించే శక్తి లేదన్నారు. పవిత్రంగా జరిగే గంగమ్మ జాతరలో చివరి రోజైన గంగమ్మను ఏ విధంగా అయితే ఊరి బయట వేస్తామో.. అదేవిధంగా మంత్రి రోజాని ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని నగిరి ప్రజలను నారాయణ పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి...

AP Election 2024: జగన్ కుయుక్తులకు కేంద్ర ఎన్నికల సంఘం చెక్

AP Elections: ఏపీ ఓటర్ల చూపు ఆ వైపేనా..?

Read Latest AP News And Telugu News

Updated Date - May 09 , 2024 | 01:48 PM