Share News

Chandrababu: సీఎస్ జవహర్ రెడ్డికి చంద్రబాబు లేఖ.. ఎందుకంటే..?

ABN , Publish Date - May 28 , 2024 | 08:03 PM

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను రాష్ట్రానికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. ఏపీకి చెందిన వందలాది మంది యువకులు కంబోడియాలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

Chandrababu: సీఎస్ జవహర్ రెడ్డికి చంద్రబాబు లేఖ.. ఎందుకంటే..?
TDP Chief Chandrababu Naidu

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను రాష్ట్రానికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. ఏపీకి చెందిన వందలాది మంది యువకులు కంబోడియాలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నకిలీ ఏజన్సీలు యువతను మోసం చేశాయని, దేశం కాని దేశం తీసుకువెళ్లి చిత్రహింసలు పెడుతూ సైబర్ నేరాలు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఎన్ఐఏ విచారణలో బయటపడ్డాయన్నారు. బాధిత యువతను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి వీలైనంత త్వరగా దేశ, తెలుగు రాష్ట్రాల యువతను తిరిగి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరారు.

ఇవి కూడా చదవండి:

NTR Jayanthi: ఎన్టీఆర్ ఆశయ సాధనకు కలిసి పనిచేద్దాం.. మోదీతో చంద్రబాబు!

Ap politics: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడికి బెయిల్..

Updated Date - May 28 , 2024 | 08:03 PM