Share News

Palnadu: టీడీపీ నేత డీజే శివపై వైసీపీ మూకల దాడి..

ABN , Publish Date - May 23 , 2024 | 12:20 PM

పల్నాడు: జిల్లాలో ఎన్నికల అనంతరం వైసీపీ చేస్తున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ ఘటన బయటపడింది. ఇప్పటి వరకు ఈవీఎంల ధ్వంసం ఘటన వెలుగులోకి రాగా ఇప్పుడు మాచర్ల నియోజకవర్గంతోపాటు నరసారావుపేట నియోజకవర్గం పరిధిలో వైసీపీ చేసిన ధారుణాలు, దౌర్జన్యాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి.

Palnadu: టీడీపీ నేత డీజే శివపై వైసీపీ మూకల దాడి..

పల్నాడు: జిల్లాలో ఎన్నికల (Elections) అనంతరం వైసీపీ (YCP) చేస్తున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ ఘటన బయటపడింది. ఇప్పటి వరకు ఈవీఎంల (EVM) ధ్వంసం ఘటన వెలుగులోకి రాగా ఇప్పుడు మాచర్ల నియోజకవర్గంతో (Macherla Constituency)పాటు నరసారావుపేట నియోజకవర్గం (Narasraopet Constituency)పరిధిలో వైసీపీ చేసిన ధారుణాలు, దౌర్జన్యాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. నరసారావుపేటకు చెందిన పెండ్యాల శివ (Siva).. ట్రాక్టర్లు పెట్టి.. డీజే (DJ) పాటలతో టీడీపీ (TDP)కి ప్రచారం నిర్వహించారు. పల్నాడు జిల్లా (Palnadu Dist.)తోపాటు ఉమ్మడి గుంటూరు జిల్లా (Guntur Dist.)లో టీడీపీ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. పోలింగ్ (13వ తేదీ) రోజున శివపై వైసీపీ మూకలు కర్రలతో విచక్షణారహితంగా దాడులు చేశారు. నడిరోడ్డుపై జరిగిన ఘటనను పోలీసులు అడ్డుకోలేదు. ఇప్పుడు శివపై దాడి వీడియో వెలుగులోకి వచ్చింది. శివపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. శివ కేవలం టీడీపీకి మద్దతు ఇస్తున్నందుకు వైసీపీ మూకలు కక్ష కట్టి దాడికి పాల్పడ్డారు.

Updated Date - May 23 , 2024 | 12:27 PM