Share News

Pension: పెన్షన్ ఇచ్చి ఇంటికొచ్చేసరికి బాత్రూంలో శవమై కనిపించిన భార్య

ABN , Publish Date - Jul 02 , 2024 | 09:12 AM

ఆనందంగా వెళ్లి ఇంటింటికీ తిరుగుతూ లబ్దిదారులకు సచివాలయ ఉద్యోగి పెన్షన్ అందజేశారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమం పూర్తవగానే ఇంటికి వచ్చారు. ఇంట్లో భార్య కనిపించలేదు. ఎటు వెళ్లిందా అని ఇల్లంతా వెదకగా బాత్రూంలో షాకింగ్ ఇన్సిడెంట్. ఏమైందో ఏమో కానీ సచివాలయ ఉద్యోగి భార్య బాత్రూంలో శవంలా కనిపించింది.

Pension: పెన్షన్ ఇచ్చి ఇంటికొచ్చేసరికి బాత్రూంలో శవమై కనిపించిన భార్య

నంద్యాల: ఆనందంగా వెళ్లి ఇంటింటికీ తిరుగుతూ లబ్దిదారులకు సచివాలయ ఉద్యోగి పెన్షన్ అందజేశారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమం పూర్తవగానే ఇంటికి వచ్చారు. ఇంట్లో భార్య కనిపించలేదు. ఎటు వెళ్లిందా అని ఇల్లంతా వెదకగా బాత్రూంలో షాకింగ్ ఇన్సిడెంట్. ఏమైందో ఏమో కానీ సచివాలయ ఉద్యోగి భార్య బాత్రూంలో శవంలా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. నంద్యాలలోని నూనెపల్లి తలారి పేటలో సచివాలయ సెక్రటరీ సుధ రాణి (32) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పింఛన్ల పంపిణీ చేసి భర్త ఇంటికి వచ్చేసరికి బాత్రూంలో శవంగా సుధారాణి కనిపించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 02 , 2024 | 10:51 AM