Share News

AP News: హౌసింగ్, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Jun 14 , 2024 | 09:38 PM

ఆంధ్రప్రదేశ్ హౌసింగ్, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు హౌసింగ్, పౌర సంబంధాల శాఖ బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందని అన్నారు. తనకు మంత్రిగా బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు, ప్రధాని నరేంద్ర మోదీకి మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.

AP News: హౌసింగ్, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి ఆసక్తికర వ్యాఖ్యలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ హౌసింగ్, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు హౌసింగ్, పౌర సంబంధాల శాఖ బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందని అన్నారు. తనకు మంత్రిగా బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు, ప్రధాని నరేంద్ర మోదీకి మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. హౌసింగ్ శాఖ గురించి అందరికీ తెలుసునని, పేదలకు గూడు కోసం గృహ నిర్మాణం చేపట్టున్నామని ఆయన చెప్పారు.


గత ప్రభుత్వంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణానికి, పూర్తయిన వాటికి ఎంతో అంతరం ఉందని మంత్రి పార్థసారథి అన్నారు. ఈ శాఖకు కేంద్ర పథకాలు, ఎన్ఆర్‌ఈజీఎస్ కింద కూడా నిధులు తెచ్చుకోగలమని చెప్పారు. రకరకాల సమస్యల కారణంగా ఈ శాఖ కొంత కుంటుపడిందని, ఇకపై సకాలంలో రివ్యూ చేసి లబ్ధిదార్లకు న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Updated Date - Jun 14 , 2024 | 09:38 PM