Share News

బోగస్‌ పెన్షన్లపై చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే

ABN , Publish Date - Sep 06 , 2024 | 12:22 AM

బోగస్‌ పెన్షన తీసుకుంటున్న వారిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కమలాపురం ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి ఆదేశించారు.

బోగస్‌ పెన్షన్లపై చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే
మాట్లాడుతున్న ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి

కమలాపురం రూరల్‌, సెప్టెంబరు 5 : బోగస్‌ పెన్షన తీసుకుంటున్న వారిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కమలాపురం ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి ఆదేశించారు. కమలాపురం మం డలంలో జరిగిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై 2023-24 సంవత్సరంలో నిర్వహించిన 1993 పనులకు సోషల్‌ ఆడిట్‌లో గుర్తించిన అవకతవకలపై గురువారంస్థానిక ఉపాధిహామీ కార్యాలయం వద్ద ప్రజావేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సంబటూరులో బోగస్‌ పింఛన్లపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ భారతి, ఎంపీడీవో జ్యోతి, ఏపీవో పార్ధసారధి, గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులు, అడిషనల్‌ ప్రాజెక్టు డైరెక్టరు నాగరత్నమ్మ, జిల్లా విజిలెన్స అధికారి రామలింగేశ్వర్‌రెడ్డి, ఏపీడీ సోమశేఖర్‌రెడ్డి, ఎంపీడీవో, క్వాలిటీ కంట్రోల్‌ అధికారి మధు, ఎ్‌సఆర్‌పీ భాస్కర్‌ ఉపాధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2024 | 12:23 AM