Share News

వైభవంగా వెంకన్న పవిత్రోత్సవాలు

ABN , Publish Date - Sep 13 , 2024 | 11:20 PM

తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లెలో కొలువైన ప్రసన్న వేంకటరమణ స్వా మి ఆలయంలో పవిత్రోత్స వాలను టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వ హిస్తున్నారు.

వైభవంగా వెంకన్న పవిత్రోత్సవాలు
స్వామి వారికి స్నపన తిరమంజనం నిర్వహిస్తున్న టీటీడీ వేదపండితులు

తంబళ్లపల్లె, సెప్టెంబరు 13: తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లెలో కొలువైన ప్రసన్న వేంకటరమణ స్వా మి ఆలయంలో పవిత్రోత్స వాలను టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వ హిస్తున్నారు. ఏడాది పొడవు నా ఆలయంలో జరిగే అర్చన లు, ఉత్సవాల్లో తెలిసి, తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయని వాటి వల్ల ఆలయ ప్రతిష్టకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో బాగంగా టీటీ డీ ఆగమ సలహాదారు ఉభయ వేదాంత కాండూరి శ్రీనివాసచార్యులు, ఉప ప్రధాన అర్చకులు కృష్ణప్రసాద్‌ భట్టర్‌, ఆలయ అర్చకులు రమేష్‌ లు శుక్రవారం తెల్లవారుజామున స్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ఆగమ శాస్త్రం ప్రకారం యాగశాల చతుష్టానార్చనం, పవి త్రప్రతిష్ట, పూర్ణాహుతి అనంతరం స్నపన తిరుమంజనం నిర్వహించా రు. భక్తులు పవిత్రోత్సవాల్లో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో వరలక్ష్మీ, ఆలయ అధికారి దుశ్యంతకు మార్‌, సిబ్బంది నగేష్‌, రవి, గ్రామప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2024 | 11:20 PM