Share News

YS Viveka Murder Case: వైఎస్ వివేక హత్య కేసు నిందితుడికి బెయిల్ మంజూరు..

ABN , Publish Date - Feb 19 , 2024 | 08:20 PM

YS Viveka Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడికి బెయిల్ మంజూర్ అయ్యింది. వివేకా కేసులో(Viveka Murder Case) అప్రువర్‌గా మారిన దస్తగిరికి బెయిల్ మంజూరైంది. కడప జిల్లా కోర్టు(Kadapa District Court) దస్తగిరికి సోమవారం బెయిల్ మంజూరు చేసింది.

YS Viveka Murder Case: వైఎస్ వివేక హత్య కేసు నిందితుడికి బెయిల్ మంజూరు..
YS Viveka Murder Case

YS Viveka Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడికి బెయిల్ మంజూర్ అయ్యింది. వివేకా కేసులో(Viveka Murder Case) అప్రువర్‌గా మారిన దస్తగిరికి బెయిల్ మంజూరైంది. కడప జిల్లా కోర్టు(Kadapa District Court) దస్తగిరికి సోమవారం బెయిల్ మంజూరు చేసింది. మూడు నెలలుగా కడప జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు దస్తగిరి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, దాడికేసులో అరెస్ట్ అయి కడప సెంట్రల్ జైల్లో ఉన్నాడు దస్తగిరి. ఎర్రగుంట్ల పోలీసులు పెట్టిన అట్రాసిటీ కేసులో రెండు వారాల కిందటే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా వేముల పోలీసులు పెట్టిన దాడి కేసులో ఇవాళ దస్తగిరికి కడప జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం గానీ.. బుధవారం గానీ కడప జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 19 , 2024 | 08:20 PM