Share News

Crime News: మైనర్ బాలికపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగుచుసిన ఘటన...

ABN , Publish Date - Sep 15 , 2024 | 08:10 AM

ఎన్టీఆర్ జిల్లా: ఇటీవల కాలంలో ఆడవారిపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చిన్న, పెద్ద, శిశువు, వృద్ధులు అని తేడా లేకుండా ఆడవారు కనిపిస్తే చాలు కొన్ని మానవ మృగాలు వారిపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. భారతదేశంలో పోక్సో చట్టం అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఆడవారిపై అఘాయిత్యాలు తగ్గడం లేదు.

 Crime News: మైనర్ బాలికపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగుచుసిన ఘటన...

ఎన్టీఆర్ జిల్లా: ఇటీవల కాలంలో ఆడవారిపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చిన్న, పెద్ద, శిశువు, వృద్ధులు అని తేడా లేకుండా ఆడవారు కనిపిస్తే చాలు కొన్ని మానవ మృగాలు వారిపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. భారతదేశంలో పోక్సో చట్టం అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఆడవారిపై అఘాయిత్యాలు తగ్గడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చి.. కఠిన చర్యలు చేపట్టినా దారుణాలు జరుగుతునే ఉన్నాయి.


తాజాగా ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. విస్సన్నపేట మండలం, చండ్రుపట్ల గ్రామంలో మరీదు శివయ్య (40) అనే వ్యక్తి మైనర్ బాలికపై అఘాహిత్యానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాలిక తండ్రి పానుగళ్ళ వెంకటేశ్వరరావు విసన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


మరీదు శివయ్య (40) చుండ్రుపట్ల గ్రామానికి చెందిన వ్యక్తి. అదే గ్రామానికి చెందిన మైనర్ బాలిక (17), ఇంట్లో ఎవరూ లేరు సమయం చూసుకుని శివయ్య బాలికపై అత్యాచారం చేశాడు. దీంతో విసన్నపేట పోలీసులు నిందితుడిపై సెక్షన్4 ఫోక్సో యాక్ట్ 64(1), బీఎన్ఎస్ (BNS) కేసు నమోదు చేసి ధర్యాప్తు చేపట్టారు.

Updated Date - Sep 15 , 2024 | 08:10 AM