Share News

శ్రీశైల మల్లనకు బంగారు పుష్పాలు

ABN , Publish Date - Sep 07 , 2024 | 12:12 AM

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానానికి శుక్రవారం కర్నూలుకు చెందిన బీసీ శివకుమార్‌ అనే భక్తుడు కుటుంబ సమేతంగా కలిసి 108 బంగారు పూలను బహూకరించారు.

శ్రీశైల మల్లనకు బంగారు పుష్పాలు
అధికారులకు బంగారు పూలను అందజేస్తున్న భక్తులు

శ్రీశైలం, సెప్టెంబరు 6: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానానికి శుక్రవారం కర్నూలుకు చెందిన బీసీ శివకుమార్‌ అనే భక్తుడు కుటుంబ సమేతంగా కలిసి 108 బంగారు పూలను బహూకరించారు. స్వామి, అమ్మవార్ల కైంకర్యాలలో ఈ బంగారు పూలను వినియోగించాలని దాత కోరారు. 108 బంగారు పూల బరువు 19 గ్రాములు ఉంటుందని దాత తెలిపారు. దాత వీటిని అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండ పంలోసీనియర్‌ వేదపండితులు గంటి రాధాకృష్ణ, పర్యవేక్షకుడు కె. అయ్యన్న, అమ్మవారి ఆలయ ఇన్స్‌స్పెక్టర్‌ కె. మల్లికార్జునకు అందజేశారు. అనంతరం దాతకు వేదాశీర్వచనం, స్వామి, అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేసి సత్కరించారు.

Updated Date - Sep 07 , 2024 | 12:12 AM