Share News

Abdul Nazeer: మహాశివరాత్రి సందర్భంగా ఏపీ గవర్నర్ సందేశం

ABN , Publish Date - Mar 07 , 2024 | 11:36 AM

Andhrapradesh: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలనుద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ సందేశం వినిపించారు. ‘‘మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ తెలిపారు.

Abdul Nazeer: మహాశివరాత్రి సందర్భంగా ఏపీ గవర్నర్ సందేశం

అమరావతి, మార్చి 7: మహా శివరాత్రి పర్వదినం (Maha Shivaratri Festival) సందర్భంగా రాష్ట్ర ప్రజలనుద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ (AP Governor Abdul Nazeer) సందేశం వినిపించారు. ‘‘మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ‘మహా శివరాత్రి’ శివ భక్తులు అందరికీ అత్యంత పవిత్రమైన, ముఖ్యమైన ఆధ్యాత్మిక పండుగ. ఈ రోజున శివుడిని ఆరాధించడం అత్యంత పవిత్రం. రోజంతా ఉపవాసం ఉంటూ, భజనలతో ఉత్సాహంగా, భక్తిపూర్వకంగా పూజలు జరుపుకుంటారు.ఈ శుభ సందర్భం మనందరిలో ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వం కలిగించాలని భగవంతుని కోరుకుంటున్నాను” అంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...

Mallareddy: మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి అధికారుల షాక్

Congress: లోక్‌సభ 2024 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఈ అంశాలపైనే కాంగ్రెస్ ఫోకస్!


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 07 , 2024 | 11:36 AM