Share News

AP Politics: రెచ్చిపోయిన ఎమ్మెల్యే.. కారు ఆపి మరీ వారిపై

ABN , Publish Date - Mar 20 , 2024 | 12:48 PM

Andhra Pradesh: ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల అరాచకాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా దెందులూరు(Denduluru)లో బీసీపీలపై వైసీపీ(YSRCP) ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి(Abbaya Chowdary), ఆయన అనుచరులు భౌతిక దాడికి పాల్పడ్డారు. అసలేం జరిగిందంటే.. దెందులూరు మండలం తిమ్మన్న గూడెంలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారం(Elections) చేశారు.

AP Politics: రెచ్చిపోయిన ఎమ్మెల్యే.. కారు ఆపి మరీ వారిపై
MLA Abbaya Chowdary

Andhra Pradesh: ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల అరాచకాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా దెందులూరు(Denduluru)లో బీసీపీలపై వైసీపీ(YSRCP) ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి(Abbaya Chowdary), ఆయన అనుచరులు భౌతిక దాడికి పాల్పడ్డారు. అసలేం జరిగిందంటే.. దెందులూరు మండలం తిమ్మన్న గూడెంలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారం(Elections) చేశారు. ఈ సందర్భంగా గ్రామ కూడలిలో ఉన్న బెంచ్ పై పలువురు యువకులు కూర్చున్నారు. వాహనంలో వెళ్తున్న అబ్బయ్య చౌదరి.. వారిని చూసి చెయ్యి ఊపారు. యువకులు సైతం తిరిగి చెయ్యి ఊపుతూ అభివాదం చేశారు. ఇక్కడే అసలు పంచాయితీ మొదలైంది. ఒక ఎమ్మెల్యేకి కూర్చుని చెయ్యి ఊపుతావా? లేచి నిలబడటం తెలియదా? అంటూ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఆయన అనుచరులు సదరు యువకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనాలు ఆపి మరీ, బెంచి మీద ఉన్న యువకులపై వైసిపి నాయకులు ఒక్కసారిగా మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పిప్పర దుర్గా ప్రసాద్ అనే యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అతన్ని ఏలూరు సర్వ జన ఆసుపత్రికి తరలించారు. దాడిని వీడియో తీస్తున్న కంచర్ల వెంకటేశ్వర యాదవ్ అనే యువకుడి ఫోన్ లాక్కుని ధ్వంసం చేశారు. కాగా, ఎమ్మెల్యే అనుచరుల తీరుపై బీసీ సామాజిక వర్గం నేతలు, టీడీపీ నాయకుల ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 20 , 2024 | 12:48 PM