Share News

నందిగామ నుంచి పోటీచేస్తున్న అభ్యర్థులు ఎవరంటే

ABN , Publish Date - May 13 , 2024 | 09:27 AM

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామ నియోజకవర్గం నుంచి మొత్తం 9 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో ప్రధానపార్టీ అభ్యర్థులు నలుగురు ఉన్నారు. మిగతా ఐదుగురు రిజిస్టర్డ్, స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈవీఎంలో మొత్తం పది వరుసలు ఉండగా చివరిది నోటా.

నందిగామ నుంచి పోటీచేస్తున్న అభ్యర్థులు ఎవరంటే
Nandigama Assembly Seat

ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఎన్నికల్లో వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కనీసం ఐదుగురు నుంచి 20 మంది వరకు పోటీలో ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో కొన్ని పోలింగ్ బూత్‌లలో రెండు ఈవీఎంలు ఏర్పాటు చేశారు. సాధారణంగా ఓటు వేసేటప్పుడు ఓటర్లు ఎక్కువమంది అభ్యర్థులు ఉండటంతో కన్ఫ్యూజ్ అవుతూఉంటారు. ఒకరికి వేద్దామని వెళ్లి మరొకరికి వేసే అవకాశం ఉంటుంది. ఈవీఎంలో ప్రధానపార్టీ అభ్యర్థుల గుర్తులు ముందువరుసలో ఉంటాయి. ఆ తరువాత రిజిస్టర్డ్ పార్టీలు, స్వంతంత్ర అభ్యర్థుల గుర్తులు ఉంటాయి. ఓటువేసేటప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుల ఆధారంగా ఓటు వేయ్యొచ్చు. అలాగే పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లతో కూడిన బ్యాలెట్ ఈవీఎంలో ఉంటుంది. ఆ పేరు ఎదురుగా ఉన్న బటన్ ప్రెస్ చేసి మనకు కావాల్సిన అభ్యర్థికి ఓటు వేయ్యొచ్చు.

AP Elections 2024: ఓటు హక్కును వినియోగించుకున్న చంద్రబాబు, జగన్..


నందిగామ అసెంబ్లీ నుంచి..

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామ నియోజకవర్గం నుంచి మొత్తం 9 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో ప్రధానపార్టీ అభ్యర్థులు నలుగురు ఉన్నారు. మిగతా ఐదుగురు రిజిస్టర్డ్, స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈవీఎంలో మొత్తం పది వరుసలు ఉండగా చివరిది నోటా. ఈవీఎం బ్యాలెట్‌లో మొదటి నెంబర్ టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య కాగా.. రెండో అభ్యర్థిగా బీఎస్పీ నుంచి బర్రె ఉదయ్ కిరణ్, మూడో అభ్యర్థిగా వైసీపీ నుంచి మొండితోక జగన్ మోహన్ రావు, నాలుగో అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి వజ్రయ్య మందా ఉన్నారు.


AP Elections: ఏడు గంటలకే పోలింగ్ కేంద్రానికి కేశినేని చిన్ని.. కానీ

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest AP News and Telugu News

Updated Date - May 13 , 2024 | 09:27 AM