Home » Nandigama
శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో ఇంటర్ విద్యార్థిని అర్చిత(Archita) ఆత్మహత్య ఘటనపై విచారణకు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ఆదేశాలు జారీ చేశారు. బలవన్మరణానికి గల కారణాలపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్ర ప్రజలంతా ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. జూన్4 ఎప్పుడు వస్తుందా అంటూ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో ఏ నియోజకవర్గం ఫలితం ముందు వస్తుందనే ఆసక్తి అందరిలో ఉంటుంది. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడంతో ఓట్ల లెక్కింపు సులభతరమైంది.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామ నియోజకవర్గం నుంచి మొత్తం 9 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో ప్రధానపార్టీ అభ్యర్థులు నలుగురు ఉన్నారు. మిగతా ఐదుగురు రిజిస్టర్డ్, స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈవీఎంలో మొత్తం పది వరుసలు ఉండగా చివరిది నోటా.
ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని అధికారులు తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతి కారును చెక్ చేస్తున్నారు. రూ.50 వేలు ఆపై నగదు తీసుకెళ్లే వారిపై ప్రత్యేక దృష్టిసారించారు. నగదు వివరాలు, సంబంధిత పత్రం చూపిస్తే వదిలేస్తున్నారు. లేదంటే సీజ్ చేస్తున్నారు. గోపయ్య అనే వృద్దుడు తెలంగాణ నుంచి మద్యం తీసుకొస్తున్నాడు. ఏపీలో మందు బ్రాండ్లు మారడంతో ఇక్కడి నుంచి తీసుకొస్తున్నాడు.
Andhrapradesh: ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలోని పార్టీలు ప్రచారాలకు సిద్ధమవుతున్నారు. మరోసారి గెలుపు మాదే అని వైసీపీ, ఈసారి తప్పకుండా గెలుస్తామని టీడీపీ ఎవరి వారు ధీమాగా ఉన్నారు. అయితే ఈ సమయంలో పలువురు నేతలు పెద్దఎత్తున వైసీపీని వీడటం అధిష్టానాన్ని తీవ్ర కలవరానికి గురిచేస్తోంది.
ఎన్టీఆర్ జిల్లా: కోస్తా జిల్లాలో గురువారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో జాతీయ రహదారిపై వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారి సరిగా కనిపించకపోవడంతో పలు ప్రాంతాల్లో డ్రైవర్లు వాహనాలు నిలిపివేశారు.
ఎన్టీఆర్ జిల్లా: నందిగామలో మునిసిపల్ కార్మికుల ఆందోళన కోనసాగుతోంది. ఐదవ రోజులో భాగంగా మున్సిపల్ కార్యాలయం గేట్ వద్ద కార్మికులు ఆందోళన నిర్వహించారు. పర్మినెట్ సిబ్బందితో కాకుండా బయట వ్యక్తులతో పారిశుద్ధ్య పనులు చేయించవద్దని కార్మికులు గేటు వద్ద బైఠాయించారు.
నందిగామ(Nandigama)లో మరొసారీ విగ్రహాల వివాదం రాజుకుంది. గురువారం నాడు నిర్వహించిన మున్సిపల్ సమావేశంలో తెలుగుదేశం నేతలు(Telugu Desam Leaders), మున్సిపల్ అధికారుల మధ్య విగ్రహాలపై ఘర్షణ తలెత్తింది.
నందిగామ ఘటనపై సాక్షి పత్రిక, ఛానల్ తప్పుడు కథనాలు ప్రచురించిందని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ మహేశ్వరరావు విమర్శించారు.
జిల్లాలోని నందిగామలో దారుణం జరిగింది. నందిగామ మండలం పల్లగిరి గట్టు వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.