Share News

Anam: ప్రజల ఆశలకు అనుగుణంగా చంద్రబాబు పాలన

ABN , Publish Date - Jul 06 , 2024 | 03:35 PM

ప్రజల ఆశలకు అనుగుణంగా చంద్రబాబు పాలన ఉంటుందని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy) తెలిపారు.

Anam: ప్రజల ఆశలకు అనుగుణంగా చంద్రబాబు  పాలన
Anam Ramanarayana Reddy

నెల్లూరు: ప్రజల ఆశలకు అనుగుణంగా చంద్రబాబు పాలన ఉంటుందని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy) తెలిపారు. మంత్రి నారాయణ నివాసంలో ఎమ్మెల్యేలతో మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి ఈరోజు(శనివారం) భేటీ అయ్యారు. జిల్లాలో సమస్యలు, అభివృద్ధిపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అపరిష్కృత సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధిపై అధికారులతో చర్చించి కలసి కట్టుగా పని చేస్తామని అన్నారు. పార్టీ బలోపేతానికి, జిల్లా అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఐక్యతతో కలసి కట్టుగా పనిచేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.


Gold: అతి తెలివితో నగలు కొట్టేసిన మహిళలు... కంగుతిన్న యాజమాన్యం

ఐదేళ్లలో రాష్ట్రం సర్వనాశనం: సోమిరెడ్డి

ఐదేళ్లలో రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) అన్నారు. జిల్లాలో పోర్ట్, ఎయిర్ పోర్ట్ అర్ధాంతరంగా ఆగిపోయాయని చెప్పారు. జిల్లాలో సెజ్‌లు, పరిశ్రమలపై దృష్టి సారించే విషయంపై ఈ సమావేశంలో చర్చించుకున్నామని అన్నారు. జిల్లాలో శాశ్వత పట్టాల పేరుతో ల్యాండ్ స్కాం జరిగిందన్నారు. జిల్లాలో రైతులకు న్యాయం చేసేందుకు, పరిశ్రమలు, పెట్టుబడులు రాబట్టేందుకు కలసికట్టుగా కృషి చేస్తామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Maheswar Reddy: ఓటమి భయంతోనే సర్పంచ్ ఎన్నికలను నిర్వహించట్లే

Satyakumar: ఏపీలో గత ఐదేళ్లలో ఆర్థిక విధ్వంసం...


Read Latest AP News And Telugu News

Updated Date - Jul 06 , 2024 | 03:42 PM