Share News

Chandrababu: నెల్లూరు, రాప్తాడులో చంద్రబాబు పర్యటన.. తేదీలు ఇవే

ABN , Publish Date - Feb 29 , 2024 | 10:37 AM

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మార్చి 2, 4 తేదీల్లో నెల్లూరు, రాప్తాడులో పర్యటించనున్నారు. ఈ మేరకు బాబు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మార్చి 2న నెల్లూరు, గురజాలలో, 4న రాప్తాడులో అధినేత పర్యటిస్తారు. 2వ తేదీ ఉదయం నెల్లూరులో చంద్రబాబు సమక్షంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీలో చేరనున్నారు.

Chandrababu: నెల్లూరు, రాప్తాడులో చంద్రబాబు పర్యటన.. తేదీలు ఇవే

అమరావతి, ఫిబ్రవరి 29: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) మార్చి 2, 4 తేదీల్లో నెల్లూరు, రాప్తాడులో పర్యటించనున్నారు. ఈ మేరకు బాబు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మార్చి 2న నెల్లూరు, గురజాలలో, 4న రాప్తాడులో అధినేత పర్యటిస్తారు. 2వ తేదీ ఉదయం నెల్లూరులో చంద్రబాబు సమక్షంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీలో చేరనున్నారు. అదే రోజు మధ్మాహ్నం గురజాలలో ‘‘రాకదలి రా’’ సభలో పాల్గొననున్నారు. అలాగే మార్చి 4న రాప్తాడు నియోజకవర్గంలో ‘‘రాకదలి..రా’’ సభలో టీడీపీ అధినేత పాల్గొంటారు. ఇప్పటికి 22 రా కదలి రా సభల్లో చంద్రబాబు పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రతి పార్లమెంట్‌లో ఒక రా కదలి రా సభను తెలుగు దేశం పార్టీ నిర్వహిస్తోంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 29 , 2024 | 10:37 AM