Share News

Rammohan Naidu: ఇవాళ శ్రీకాకుళం జిల్లాకు బాబాయి, అబ్బాయి..

ABN , Publish Date - Jun 17 , 2024 | 10:55 AM

నేడు శ్రీకాకుళం జిల్లాకు రాష్ట్ర, కేంద్ర మంత్రులైన బాబాయి, అబ్బాయి రానున్నారు. రాష్ట్ర మంత్రివర్యులు కింజారపు అచ్చెన్నాయుడు, కేంద్ర విమానయాన శాఖామాత్యులు కింజారాపు రామ్మోహన్ నాయుడు నేడు జిల్లాకు రానున్నారు. ఉదయం 9.30 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి ర్యాలీ గా బయలుదేరనున్నారు.

Rammohan Naidu: ఇవాళ శ్రీకాకుళం జిల్లాకు బాబాయి, అబ్బాయి..

శ్రీకాకుళం: నేడు శ్రీకాకుళం జిల్లాకు రాష్ట్ర, కేంద్ర మంత్రులైన బాబాయి, అబ్బాయి రానున్నారు. రాష్ట్ర మంత్రివర్యులు కింజారపు అచ్చెన్నాయుడు, కేంద్ర విమానయాన శాఖామాత్యులు కింజారాపు రామ్మోహన్ నాయుడు నేడు జిల్లాకు రానున్నారు. ఉదయం 9.30 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి ర్యాలీ గా బయలుదేరనున్నారు. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ఎన్ఏడీ, మద్దిలపాలెం మీదుగా ర్యాలీగా శ్రీకాకుళం జిల్లాకు చేరుకోనున్నారు.


మధ్యాహ్నం 1.30 గంటలకు భోగాపురం వద్ద అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు భోజన విరామం తీసుకోనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు బయల్దేరి శ్రీకాకుళం ఆర్చి , డే అండ్ నైట్ కూడలి , 7 రోడ్లు జంక్షన్ , జీటీ రోడ్ , సూర్యమహల్ జంక్షన్ , అరసవిల్లి జంక్షన్ మీదుగా రామ్మోహన్ నాయుడు ఇంటి వరకూ ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 5.00 గంటలకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కార్యాలయం నుంచి సూర్య మహల్ జంక్షన్ , రామలక్ష్మణ్ జంక్షన్ , పెద్దపాడు , జాతీయరహదారి మీదుగా నిమ్మాడ చేరుకోనున్నారు.

Updated Date - Jun 17 , 2024 | 10:55 AM