Share News

Crime News: మద్యం మత్తులో గాజుపెంకుతో ఛాతిలో పొడిచి..

ABN , Publish Date - Jun 13 , 2024 | 09:46 PM

తణుకు(Tanuku) మండలం దువ్వ గ్రామం(Duvva village)లో దారుణం జరిగింది. ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఘర్షణ ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది.

Crime News: మద్యం మత్తులో గాజుపెంకుతో ఛాతిలో పొడిచి..

పశ్చిమ గోదావరి: తణుకు(Tanuku) మండలం దువ్వ గ్రామం(Duvva village)లో దారుణం జరిగింది. ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఘర్షణ ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. పెరవలి మండలం ముక్కామల గ్రామానికి చెందిన కౌరు భాస్కరరావు, దువ్వ గ్రామానికి చెందిన కాకి రామకృష్ణ మధ్య మద్యం మత్తులో వాగ్వాదం జరిగింది. గొడవ జరుగుతుండగా ద్విచక్రవాహనంపై వెళ్లిపోతున్న భాస్కరరావును గాజుపెంకుతో ఛాతి భాగంలో రామకృష్ణ పొడిచాడు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత అపస్మారక స్థితికి చేరుకున్న భాస్కరరావు.. బైక్ పైనుంచి పడిపోయారు. చికిత్స నిమిత్తం హుటాహుటిన తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే మృతిచెందాడు.

ఇవి కూడా చదవండి:

CM Chandrababu: పరదాల పాలన నుంచి ప్రజాపాలనకు శ్రీకారం..

Pawan Kalyan: జూన్ 20తర్వాత పిఠాపురం వస్తా: పవన్ కల్యాణ్

CM Chandrababu: సీఎం చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టిన అమరావతి రైతులు..

Updated Date - Jun 13 , 2024 | 09:51 PM