Share News

Chandrababu: ఈనెల 7న ఆచంటకు టీడీపీ అధినేత చంద్రబాబు

ABN , Publish Date - Jan 02 , 2024 | 02:21 PM

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 7న ఆచంటలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సభా స్థలి ఏర్పాట్లపై టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు.

Chandrababu: ఈనెల 7న ఆచంటకు టీడీపీ అధినేత చంద్రబాబు

పశ్చిమగోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) ఈనెల 7న ఆచంటలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సభా స్థలి ఏర్పాట్లపై టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ఉండి ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, మాజీ మంత్రి జవహర్, పీతల సుజాత ఆచంటకు చేరుకున్నారు. ఈ క్రమంలో నాయకులు, కార్యకర్తలకు టీడీపీ నేతలు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఆచంట నుంచే ఎన్నికల శంఖారావం చంద్రబాబు పూరిస్తారని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ వెల్లడించారు.

Updated Date - Jan 02 , 2024 | 02:21 PM