Share News

Bonda Uma: ఓటమి భయంతో టీడీపీ నాయకులు, ఆఫీసులపై వైసీపీ దాడులు

ABN , Publish Date - May 15 , 2024 | 09:13 AM

ఎన్నికల అనంతరం జరుగుతున్న హింస పై ఎన్నికలసంఘం దృష్టి పెట్టాలని పోలీసులను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ కోరారు. వైసీపీ ఓటమి భయంతో టీడీపీ నాయకుల ఆఫీసులపై దాడులకు పాల్పడుతోందన్నారు. పిన్నెల్లి, చెవిరెడ్డి రౌడీఇజంపై డీజీపీ దృష్టి పెట్టాలని.. వెంటనే పినెల్లి సోదరులను అరెస్టు చేయాలని బోండా ఉమ డిమాండ్ చేశారు.

Bonda Uma: ఓటమి భయంతో టీడీపీ నాయకులు, ఆఫీసులపై వైసీపీ దాడులు

అమరావతి: ఎన్నికల అనంతరం జరుగుతున్న హింస పై ఎన్నికలసంఘం దృష్టి పెట్టాలని పోలీసులను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ (Bonda Uma) కోరారు. వైసీపీ ఓటమి భయంతో టీడీపీ నాయకుల ఆఫీసులపై దాడులకు పాల్పడుతోందన్నారు. పిన్నెల్లి, చెవిరెడ్డి రౌడీఇజంపై డీజీపీ దృష్టి పెట్టాలని.. వెంటనే పినెల్లి సోదరులను అరెస్టు చేయాలని బోండా ఉమ డిమాండ్ చేశారు. చంద్రగిరి రౌడీ చెవిరెడ్డి ని అరెస్టు చేయాలన్నారు. ఎక్కడా జరగని దాడులు మాచర్ల, చంద్రగిరిలోనే జరుగుతున్నాయన్నారు. ఇంకా వైసీపీ గుండాలు తాము అధికారంలోనే ఉన్నాం అనుకొంటున్నారని బోండా ఉమ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

కవిత కస్టడీ 20 వరకు పొడిగింపు

మోదీ ఆస్తి రూ.3.2 కోట్లు

Read Latest AP News and Telugu News

Updated Date - May 15 , 2024 | 09:13 AM