Share News

AP News: టీడీఎల్పీ కార్యాలయానికి వైసీపీ ఎమ్మెల్యే.. ఆపై అసెంబ్లీ లాబీలో ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 08 , 2024 | 11:39 AM

ఇవాళ టీడీఎల్పీ కార్యాలయానికి వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి రావడం ఆసక్తికరంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యేలను కాపు ఆప్యాయంగా పలుకరించారు. తనకు అన్యాయం జరిగిందని.. తనకు దేవుడే న్యాయం చేస్తారని పేర్కొన్నారు.

AP News: టీడీఎల్పీ కార్యాలయానికి వైసీపీ ఎమ్మెల్యే.. ఆపై అసెంబ్లీ లాబీలో ఆసక్తికర వ్యాఖ్యలు

అమరావతి: ఇవాళ టీడీఎల్పీ కార్యాలయానికి వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి రావడం ఆసక్తికరంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యేలను కాపు ఆప్యాయంగా పలుకరించారు. తనకు అన్యాయం జరిగిందని.. తనకు దేవుడే న్యాయం చేస్తారని పేర్కొన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ టిక్కెట్ ఇవ్వకపోవడం, ఆ తరువాత అపాయింట్‌మెంట్ కూడా నిరాకరించడంతో ప్యాలస్‌తో పాటు అధినేతకు సైతం కాపు గుడ్ బై చెప్పారు.

అనంతరం అసెంబ్లీ లాబీల్లో కాపు రామచంద్రా రెడ్డి కాసేపు మీడియాతో చిట్ చాట్ చేశారు. ఏ పరిస్థితుల్లో తాను వైసీపీలోకి వచ్చానో అందరికీ తెలుసన్నారు. 2012లో పార్టీ పెట్టినప్పటి నుంచి తాను జగన్ వెనుకే ఉన్నానన్నారు. అలాంటి తన పరిస్థితే ఇలా ఉంటే.. మిగిలిన వాళ్ల సంగతి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. తన భవిష్యత్‌ను పైవాడే నిర్ణయిస్తాడని కాపు తెలిపారు.

Updated Date - Feb 08 , 2024 | 11:39 AM