Share News

Ram Mandir Pran Pratishtha: స్పైస్‌జెట్ స్పెషల్ ఆఫర్..ఏకంగా 30 శాతం

ABN , Publish Date - Jan 22 , 2024 | 01:16 PM

అయోధ్యలో రామమందిర్ 'ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుక సందర్భంగా ప్రముఖ విమాన సంస్థ స్పైస్‌జెట్(Spicejet) ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. SpiceMAX, యూఫస్ట్, సహా పలు సీట్లపై 30 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది.

Ram Mandir Pran Pratishtha: స్పైస్‌జెట్ స్పెషల్ ఆఫర్..ఏకంగా 30 శాతం

అయోధ్య(ayodhya)లో రామమందిర్(Ram Mandir) 'ప్రాణ్ ప్రతిష్ఠ'(Pran Pratishtha) వేడుక సందర్భంగా ప్రముఖ విమాన సంస్థ స్పైస్‌జెట్(Spicejet) ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. SpiceMAX, యూఫస్ట్, సహా పలు సీట్లపై 30 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో దేశీయ, అంతర్జాతీయ డైరెక్ట్ వన్ వే విమానాల ఛార్జీలు రూ.1,622 (అన్నీ కలుపుకొని) నుంచి ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. ఈ ఆఫర్ జనవరి 22 నుంచి 28 మధ్య చేసిన బుకింగ్‌లకు చెల్లుబాటు అవుతుందని చెప్పింది. ఈ క్రమంలో ముంబై-గోవా, ఢిల్లీ-జైపూర్, గౌహతి-బాగ్డోగ్రా వంటి ప్రముఖ దేశీయ మార్గాలకు అన్నీ కలిపి రూ.1,622 ధర వర్తిస్తుందని వెల్లడించింది.


మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: Ram Mandir: అయోధ్య ప్రత్యేక ఆహ్వానితులకు ప్రసాదం బాక్స్..అందులో ఏమున్నాయంటే

దీంతోపాటు ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఎయిర్ కనెక్టివిటీని మరింత పెంచనున్నట్లు చెప్పింది. స్పైస్‌జెట్ దేశంలోని ప్రధాన నగరాలను అయోధ్యకు కలుపుతూ కొత్త విమానాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుంచి ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు, జైపూర్, పాట్నా, దర్భంగా, ముంబైకి నాన్‌స్టాప్ విమానాలను ప్రారంభించనున్నట్లు ఎయిర్‌లైన్ తెలిపింది.

ఈ ప్రత్యేక ఛార్జీ స్పైస్‌జెట్ నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉంది. వెబ్‌సైట్, m-సైట్, మొబైల్ యాప్, రిజర్వేషన్‌లు ఎంపిక చేసిన ట్రావెల్ ఏజెంట్‌లను కలిగి ఉంటుంది. సేల్ ఆఫర్ కింద చేసిన బుకింగ్‌ల కోసం ప్రయాణీకులు ఉచిత తేదీ మార్పు ఆఫర్‌ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇది విమానం బయలుదేరే సమయానికి కనీసం 96 గంటల ముందు అందుబాటులో ఉన్నప్పుడు వర్తిస్తుంది.

Updated Date - Jan 22 , 2024 | 01:16 PM