Share News

Hyderabad: గ్యాంగ్‌ రేప్‌ కేసులో పోలీసుల అదుపులో నిందితులు..?

ABN , Publish Date - Jun 26 , 2024 | 11:21 AM

ఐదుగురు గంజాయి బ్యాచ్‌ పోకిరీలు బాలికపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో వారిని నేరేడ్‌మెట్‌ పోలీసులు(Neredmet Police) అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫోన్‌లో పరిచయం అయిన బాలికను నిందితుడు విజయ్‌కుమార్‌ మాయమాటలతో లోబర్చుకున్నాడు.

Hyderabad: గ్యాంగ్‌ రేప్‌ కేసులో పోలీసుల అదుపులో నిందితులు..?

హైదరాబాద్: ఐదుగురు గంజాయి బ్యాచ్‌ పోకిరీలు బాలికపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో వారిని నేరేడ్‌మెట్‌ పోలీసులు(Neredmet Police) అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫోన్‌లో పరిచయం అయిన బాలికను నిందితుడు విజయ్‌కుమార్‌ మాయమాటలతో లోబర్చుకున్నాడు. బాలిక తల్లి ఇంట్లోలేని సమయంలో ఆమెను బైక్‌పై ఎక్కించుకొని నేరేడ్‌మెట్‌ ప్రాంతానికి తీసుకెళ్లి మత్తుపదార్థాలను అలవాటు చేశాడు. ఆ తర్వాత తన స్నేహితులు బాలు, కృష్ణ, కిరణ్‌, అజయ్‌లతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఇదికూడా చదవండి: Hyderabad: జీహెచ్‌ఎంసీ ఆస్తులను డిజిటలైజ్‌ చేయాలి..


రాచకొండ కమిషనరేట్‌(Rachakonda Commissionerate) ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేరేడ్‌మెట్‌ పోలీసులు ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దిగి ప్రధాన నిందితుడు విజయ్‌ని అరెస్టు చేసినట్లు తెలిసింది. అతన్ని విచారించిన క్రమంలో మిగిలిన నలుగురు నిందితుల వివరాలు తెలుసుకొని అందరినీ అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 26 , 2024 | 11:21 AM