Share News

Hyderabad: ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి..

ABN , Publish Date - Jun 27 , 2024 | 11:06 AM

ఒడిశా నుంచి మహారాష్ట్ర(Odisha to Maharashtra)కు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ, చౌటుప్పల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Hyderabad: ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి..

- ముగ్గురు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల అరెస్ట్‌

- రెండు కార్లు, 280 కిలోల సరుకు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: ఒడిశా నుంచి మహారాష్ట్ర(Odisha to Maharashtra)కు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ, చౌటుప్పల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహారాష్ట్ర షోలాపూర్‌ బ్రహ్మపురి గ్రామానికి చెందిన బోంస్లే ఆబా మచ్చీంద్ర అలియాస్‌ అబా (29), షోలాపూర్‌ సౌత్‌కు చెందిన అవినాష్‌ శివాజీ రాథోడ్‌(19), షోలాపూర్‌ సౌత్‌ పాషానగర్‌కు చెందిన సిద్దరామేశ్వర్‌ పూజారి అలియాస్‌ సిద్దూ(27) స్నేహితులు. 10వ తరగతి వరకు చదువుకుని డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. వీరికి షోలాపూర్‌కు చెందిన గంజాయి విక్రేత అజయ్‌ రాథోడ్‌తో పరిచయం ఏర్పడింది. అజయ్‌ డబ్బు, వాహనాలు సమకూర్చితే ఈ ముగ్గురు ఒడిశా అలూరి కోటకు చెందిన తేజ నుంచి గంజాయి కొనుగోలు చేసి షోలాపూర్‌కు తీసుకొచ్చి అధిక ధరకు విక్రయిస్తున్నారు.

ఇదికూడా చదవండి: TSRTC: గ్రేటర్‌ నుంచి పుణ్యక్షేత్రాలకు బస్సులు..


గంజాయి కొనుగోలు చేసేందుకు అజయ్‌ రాథోడ్‌ డబ్బులు, కార్లు (స్విఫ్ట్‌ డిజైర్‌, ఇన్నోవా) సమకూర్చాడు. రెండు కార్లలో ఒడిశా వెళ్లిన ముగ్గురు నిందితులు 280 కిలోల గంజాయిని తీసుకొని విజయవాడ, ఖమ్మం, హైదరాబాద్‌ మీదుగా షోలాపూర్‌ వెళ్తున్నారు. వీరి దందాపై పక్కా సమాచారమందుకున్న ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ, చౌటుప్పల్‌ పోలీసులు పంతంగి టోల్‌గేట్‌ వద్ద కార్లను తనిఖీ చేశారు. రెండు కార్లు, 280 కిలోల గంజాయి, మూడు మొబైల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 27 , 2024 | 11:06 AM