Share News

Hyderabad: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్‌..

ABN , Publish Date - May 30 , 2024 | 11:06 AM

తనను చంపుతామని కొందరు దుండగులు ఫోన్‌ చేసి బెదిరింపులకు దిగారని గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌(Goshamahal BJP MLA Rajasingh) తెలిపారు. ఇప్పటికే పలుమార్లు బెదిరింపు కాల్స్‌ రాగా.. పోలీసులకు ఫిర్యాదు చేశానని ‘ఎక్స్‌’లో వెల్లడించారు.

Hyderabad: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్‌..

హైదరాబాద్: తనను చంపుతామని కొందరు దుండగులు ఫోన్‌ చేసి బెదిరింపులకు దిగారని గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌(Goshamahal BJP MLA Rajasingh) తెలిపారు. ఇప్పటికే పలుమార్లు బెదిరింపు కాల్స్‌ రాగా.. పోలీసులకు ఫిర్యాదు చేశానని ‘ఎక్స్‌’లో వెల్లడించారు. ఈ విషయాన్ని పోలీసులు పట్టించుకోవట్లేదని అసహనం వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి: Hyderabad: అంతర్రాష్ట్ర ఘరానా దొంగ అరెస్ట్‌


ఫోన్‌ చేసిన దుండగులను గుర్తించి వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బెదిరింపు కాల్స్‌కు సంబంధించిన వివరాలను ఫోన్‌లో స్ర్కీన్‌ షాట్స్‌(Screen shots) తీసి పోస్టు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, తెలంగాణ సీఎంవో, డీజీపీ, హైదరాబాద్‌ పోలీసులకు ఈ పోస్టును ట్యాగ్‌ చేశారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu Newshy

Updated Date - May 30 , 2024 | 11:06 AM