Share News

Loksabha Polls: ఓటేసిన తెలంగాణ సీఎం రేవంత్

ABN , Publish Date - May 13 , 2024 | 12:29 PM

తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించడం తప్ప పోలింగ్ కూల్‌గా సాగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రలో సతీ సమేతంగా ఓటు వేశారు.

Loksabha Polls: ఓటేసిన తెలంగాణ సీఎం రేవంత్
CM Revanth Reddy

కొడంగల్: తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించడం తప్ప పోలింగ్ కూల్‌గా సాగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దంపతులు కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రలో సతీ సమేతంగా ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం మీడియాకు వేలిని చూపించారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు ఓటు వేశారు. హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఓటు ఉంది. ఆయన కరీంనగర్ నుంచి హుస్నాబాద్‌కు ఆర్టీసీ బస్సులో వెళ్లి మరీ ఓటు వేశారు.

Updated Date - May 13 , 2024 | 01:10 PM