Share News

Lok Sabha Election 2024: ప్రధాని మోదీ సభా వేదిక మీదకు రాజాసింగ్‌కు నో ఎంట్రీ

ABN , Publish Date - May 10 , 2024 | 06:28 PM

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు ఇంకా మూడు రోజుల సమయమే ఉండటంతో బీజేపీ ప్రచారాన్ని ఉదృతం చేసింది ఎన్నికల ప్రణాళికలో భాగంగా శుక్రవారం నగరంలోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ (BJP) ‘‘భాగ్యనగర్ జనసభ’’కు పిలుపునిచ్చిది. ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అయితే ఈ సభలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‪కు (Rajasingh) చేదు అనుభవం ఎదురైంది.

Lok Sabha Election 2024: ప్రధాని మోదీ సభా వేదిక మీదకు  రాజాసింగ్‌కు నో ఎంట్రీ
Rajasingh

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు ఇంకా మూడు రోజుల సమయమే ఉండటంతో బీజేపీ ప్రచారాన్ని ఉదృతం చేసింది ఎన్నికల ప్రణాళికలో భాగంగా శుక్రవారం నగరంలోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ (BJP) ‘‘భాగ్యనగర్ జనసభ’’కు పిలుపునిచ్చిది. ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అయితే ఈ సభలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‪కు (Rajasingh) చేదు అనుభవం ఎదురైంది. ప్రధాని మోదీ సభా వేదిక మీదకు రాజాసింగ్‌ను పోలీసులు అనుమతిచ్చలేదు. లిస్ట్‌లో ఆయన పేరు లేకపోవడంతో వేదిక మీదకు అనుతించలేదు.


నిర్దేశించిన సమయం‌ కంటే ఆలస్యంగా వచ్చిన కారణంగానే రాజాసింగ్‌ను వేదిక మీదకు పంపించలేదు. దీంతో కార్యకర్తల మధ్యలో కూర్చుని మోదీ సభను రాజాసింగ్ వీక్షించారు. గోషామహాల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే ఎల్బీ స్టేడియం ఉండటం గమనార్హం. రాజాసింగ్‌ను పోలీసులు అనుమతించకపోవడంతో బీజేపీ కార్యకర్తలు పోలీసుల తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సభలో కమలం నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

Bandi Sanjay: కేసీఆర్ ఏమైనా సుద్ద పూసా? వేస్ట్ ఫెల్లో ఆఫ్ ఇండియా..

Read Latest Telangana News and Telugu News

Updated Date - May 10 , 2024 | 06:40 PM