Share News

Loksabha Polls: కంగనా రనౌత్‌‌పై హిమాచల్ ప్రదేశ్ మంత్రి పోటీ

ABN , Publish Date - Apr 13 , 2024 | 04:42 PM

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్‌లో గల మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున కంగనా రనౌత్‌ బరిలోకి దిగారు. కంగనాకు పోటీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది.

Loksabha Polls: కంగనా రనౌత్‌‌పై హిమాచల్ ప్రదేశ్ మంత్రి పోటీ
Vikramaditya Singh To Take On Kangana Ranaut In Mandi

సిమ్లా: బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ (Kangana Ranaut) లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్‌లో గల మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున కంగనా రనౌత్‌ బరిలోకి దిగారు. కంగనాకు పోటీగా కాంగ్రెస్ పార్టీ (Congress) అభ్యర్థిని ప్రకటించింది.


Kejriwal: ఇదేం పద్ధతి.. జైలులో కేజ్రీవాల్‌ను కలువనీయలేదు..?

మండి లోక్ సభకు కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రి విక్రమాదిత్య సింగ్ పోటీ చేస్తారు. ఈ విషయాన్ని హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ ప్రకటించారు. ప్రతిభా సింగ్ కుమారుడే విక్రమాదిత్య సింగ్ అనే సంగతి తెలిసిందే. మండి ప్రజలు ఎల్లప్పుడూ తమతో ఉంటారని, ఈ సారి కూడా ఉంటారని ప్రతిభా సింగ్ ధీమాతో ఉన్నారు. కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ పార్టీ గట్టి అభ్యర్థినే బరిలోకి దింపింది. మండి నుంచి విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇందుకు బీజేపీ ఎలాంటి ఎత్తులు వేస్తుందో చూడాలి.

BJP: అట్టహాసంగా అమిత్‌షా రోడ్‌షో.. మోదీ నినాదాలతో దద్దరిల్లిన మదురై

Video: సీఎం కోసం స్వీట్ షాప్‌కు వెళ్లిన రాహుల్ గాంధీ..తర్వాత ఏమైందంటే

మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 13 , 2024 | 04:42 PM