Share News

Washington : ఉగ్రవాది రాణాను భారత్‌కు అప్పగించవచ్చు

ABN , Publish Date - Aug 18 , 2024 | 03:43 AM

ముంబయిపై జరిగిన ఉగ్రవాది దాడికి కీలక సూత్రధారిగా ఉన్న పాక్‌ జాతీయుడైన కెనడా వ్యాపారి తహవ్వుర్‌ హుస్సేన్‌ రాణా(63)ను భారత్‌కు అప్పగించవచ్చని అమెరికాలోని కాలిఫోర్నియోలోని 9వ సర్క్యూట్‌ అప్పీల్స్‌ కోర్టు తీర్పునిచ్చింది.

Washington : ఉగ్రవాది రాణాను భారత్‌కు అప్పగించవచ్చు

వాషింగ్టన్‌, ఆగస్టు 17: ముంబయిపై జరిగిన ఉగ్రవాది దాడికి కీలక సూత్రధారిగా ఉన్న పాక్‌ జాతీయుడైన కెనడా వ్యాపారి తహవ్వుర్‌ హుస్సేన్‌ రాణా(63)ను భారత్‌కు అప్పగించవచ్చని అమెరికాలోని కాలిఫోర్నియోలోని 9వ సర్క్యూట్‌ అప్పీల్స్‌ కోర్టు తీర్పునిచ్చింది. నేరస్థుల పరస్పర అప్పగింతకు సంబంధించి భారత్‌-అమెరికాల మధ్య ఒప్పందం ఉన్నందున దాని ప్రకారం రాణాను విచారణ నిమిత్తం భారత్‌కు అప్పగించవచ్చని తెలిపింది. రాణా ప్రస్తుతం లాస్‌ ఏంజెల్స్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. 26/11 ముంబయి ఉగ్రదాడులకు వ్యూహం పన్నిన లష్కరేకు చెందిన పాకిస్థాన్‌-అమెరికన్‌ ఉగ్రవాది డేవిడ్‌ కోల్‌మెన్‌ హెడ్లీకి ప్రధాన అనుచరునిగా వ్యవహరించాడు.

Updated Date - Aug 18 , 2024 | 03:43 AM