Share News

Boat Capsizes: గంగానదిలో పడవ మునక...ఆరుగురి జాడ గల్లంతు

ABN , Publish Date - Jun 16 , 2024 | 02:35 PM

బీహార్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. పాట్నాలోని ఉమానాథ్ గంగా ఘాట్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న పడవ గంగానదిలో మునిగిపోయింది. ఆదివారం ఉదయం 9.15 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురి జాడ గల్లంతైంది.

Boat Capsizes: గంగానదిలో పడవ మునక...ఆరుగురి జాడ గల్లంతు

పాట్నా: బీహార్‌ (Bihar)లో ఘోర విషాదం చోటు చేసుకుంది. పాట్నాలోని ఉమానాథ్ గంగా ఘాట్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న పడవ గంగానది (Ganga river)లో మునిగిపోయింది. ఆదివారం ఉదయం 9.15 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురి జాడ గల్లంతైంది. పడవలో దాదాపు ఒకే కుటుంబానికి చెందిన 17 మంది ప్రయాణిస్తుండగా పడవ తల్లకిందులైనట్టు బార్హ్ సబ్-డివిజనల్ అధికారి తెలిపారు. స్థానికులు 11 మందిని ప్రాణాలతో రక్షించారని, ఆరుగురి జాడ ఇంకా తెలియలేదని చెప్పారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ టీమ్‌ కూడా రంగంలోకి దిగిందని తెలిపారు. ఉమానాథ్ గంగా ఘాట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 16 , 2024 | 02:55 PM