Share News

Hajj pilgrimage : హజ్‌ యాత్రలో 98 మంది భారతీయుల మృతి

ABN , Publish Date - Jun 22 , 2024 | 03:03 AM

ఈ ఏడాది సౌదీ అరేబియాలో హజ్‌ యాత్ర సందర్భంగా వేర్వేరు కారణాలతో 98 మంది భారతీయులు మరణించినట్టు కేంద్రప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది.

 Hajj pilgrimage : హజ్‌ యాత్రలో 98 మంది భారతీయుల మృతి

న్యూఢిల్లీ, జూన్‌ 21: ఈ ఏడాది సౌదీ అరేబియాలో హజ్‌ యాత్ర సందర్భంగా వేర్వేరు కారణాలతో 98 మంది భారతీయులు మరణించినట్టు కేంద్రప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. ఈ ఏడాది 1,75,000 మంది భారతీయ యాత్రికులు హజ్‌ కోసం మక్కాను సందర్శించినట్టు తెలిపింది. కాగా, సౌదీ అరేబియాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో హజ్‌ యాత్రలో వడదెబ్బతో పది దేశాలకు చెందిన 1,081 మంది యాత్రికులు చనిపోయినట్టు తెలిసింది.

Updated Date - Jun 22 , 2024 | 07:04 AM