Share News

Drought relief: కర్ణాటకకు కేంద్రం రూ.3,454 కోట్ల కరువు నిధి

ABN , Publish Date - Apr 27 , 2024 | 04:49 PM

కరువు సహాయక పనుల కోసం కర్ణాటకకు రూ.3,454 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సారథ్యంలోని అత్యున్నత స్థాయి కమిటీ కరువు ఉపశమనం (ఖరీప్ 2023) కింద నిధుల విడుదలకు ఆమోదం తెలిపినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది.

Drought relief: కర్ణాటకకు కేంద్రం రూ.3,454 కోట్ల కరువు నిధి

న్యూఢిల్లీ: కరువు సహాయక పనుల (Drough relief works) కోసం కర్ణాటక (Karnataka)కు రూ.3,454 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సారథ్యంలోని అత్యున్నత స్థాయి కమిటీ కరువు ఉపశమనం (ఖరీప్ 2023) కింద నిధుల విడుదలకు ఆమోదం తెలిపినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది.

LokSabha Elections: మమతా బెనర్జీకి మళ్లీ గాయాలు!


వర్షాభావం కారణంగా పంటలను కోల్పోయిన రైతులకు రూ.5,661 కోట్ల పరిహారంతో సహా కరువు సహాయక పనుల కోసం రూ.18,174 కోట్లు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే కేంద్ర నిధుల విడుదలలో తలెత్తిన జాప్యం కర్ణాటక, కేంద్ర మధ్య కొద్దికాలంగా మాటల యుద్ధానికి దారితీసింది. దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటక పట్ల కేంద్రం సవతితల్లి వైఖరి అనుసరిస్తోందని కర్ణాటక ప్రభుత్వం కేంద్రాన్ని తప్పుపట్టింది. అయితే, సహాయక పనులు చేపట్టేందుకు ప్రకృతి వైపరీత్యాల నిధి కింద తగినన్ని నిధులు కర్ణాటక వద్ద ఉన్నాయని కేంద్రం చెబుతూ వచ్చింది. తొమ్మిది నెలలుగా కేంద్రం సాగిస్తున్న జాప్యంపై కర్ణాటక ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కరువు సహాయక నిధుల విడుదలకు జోక్యం చేసుకోవాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. దీంతో కర్ణాటకకు ఉపశమనం కలిగించేందుకు సాధ్యమైనంత త్వరలో ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటామని సుప్రీకోర్టుకు కేంద్రం హామీ ఇచ్చింది.

Read National News And Telugu News

Updated Date - Apr 27 , 2024 | 04:57 PM