Share News

Cheetah: చిరుత సంచారం... పాఠశాలలకు సెలవు

ABN , Publish Date - Apr 13 , 2024 | 12:52 PM

చిరుత సంచరిస్తుండడంతో ఓ జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్‌ ఆణిమేరిస్వర్ణ ఉత్తర్వులు జారీ చేశారు. మైలాడుదురై సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరిస్తున్న చిరుత(Cheetah)... అరియలూరు జిల్లా పొన్‌పరప్పి, సిదలవాడి ప్రాంతాల్లో తిరుగున్నట్లు గురువారం వార్తలు రావడంతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Cheetah: చిరుత సంచారం... పాఠశాలలకు సెలవు

చెన్నై: చిరుత సంచరిస్తుండడంతో ఓ జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్‌ ఆణిమేరిస్వర్ణ ఉత్తర్వులు జారీ చేశారు. మైలాడుదురై సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరిస్తున్న చిరుత(Cheetah)... అరియలూరు జిల్లా పొన్‌పరప్పి, సిదలవాడి ప్రాంతాల్లో తిరుగున్నట్లు శుక్రవారం వార్తలు రావడంతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెటుకొని జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులను ఇళ్లకు పంపించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. అలాగే, భద్రత దృష్ట్యా ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అరియలూరు జిల్లాలోని 22 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన అటవీ శాఖ సిబ్బంది, చిరుత కోసం గాలిస్తున్నారు.

ఇదికూడా చదవండి: Summer special trains: నెల్లూరు, ఒంగోలు, విజయవాడ మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు..

Updated Date - Apr 13 , 2024 | 12:52 PM