Share News

National: కుంగిన వేదిక.. రాహుల్‌కు తప్పిన ప్రమాదం

ABN , Publish Date - May 28 , 2024 | 05:24 AM

బిహార్‌ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీకి త్రుటిలో ప్రమాదం తప్పింది.

National: కుంగిన వేదిక.. రాహుల్‌కు తప్పిన ప్రమాదం

పాలీగంజ్‌, మే 27: బిహార్‌ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. పాటలీపుత్రలో పోటీచేస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ కుమార్తె మీసా భారతి తరఫున పాలీగంజ్‌లో ఆయన ప్రచారం చేశారు.

మీసా ఆయన్ను వేదికపైకి తోడ్కొని వెళ్తుండగా.. ఆకస్మికంగా వేదికలో కొంత భాగం కూలింది. ఆయన బ్యాలెన్స్‌ తప్పి పడబోయారు. వెంటనే మీసా ఆయన చేతిని గట్టిగా పట్టుకోవడంతో తమాయించుకుని నిలబడ్డారు. ఈలోపు సెక్యూరిటీ సిబ్బంది పరిగెత్తుకు రావడంతో తాను క్షేమంగానే ఉన్నానంటూ రాహుల్‌ చిరునవ్వుతో తెలిపారు.

Updated Date - May 28 , 2024 | 05:24 AM