Share News

Delhi : ఢిల్లీలో సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌లోకి వరద

ABN , Publish Date - Jul 28 , 2024 | 04:38 AM

ఢిల్లీలో దారుణం జరిగింది. భారీ వర్షాలకు నగరంలోని ఓ సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌ భవనం సెల్లార్‌ను వరద ముంచెత్తగా ఇద్దరు విద్యార్థులు మరణించారు.

Delhi : ఢిల్లీలో సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌లోకి వరద

  • ఇద్దరు విద్యార్థుల మృతి, ఒకరు గల్లంతు

న్యూఢిల్లీ, జూలై 27: ఢిల్లీలో దారుణం జరిగింది. భారీ వర్షాలకు నగరంలోని ఓ సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌ భవనం సెల్లార్‌ను వరద ముంచెత్తగా ఇద్దరు విద్యార్థులు మరణించారు. మరొకరు గల్లంతయ్యారు. ఢిల్లీ కరోల్‌ భాగ్‌ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. ఆ భవనం సెల్లార్‌లో సదరు కోచింగ్‌ సెంటర్‌ గ్రంథాలయం ఉంది. కొందరు విద్యార్థులు అక్కడ చదువుకుంటుండగా హఠాత్తుగా వరద పోటెత్తి సెల్లార్‌ పూర్తిగా నీటితో నిండిపోయింది. దీంతో ముగ్గురు విద్యార్థులు గల్లంతవ్వగా కాసేపటికి ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభించాయి.

Updated Date - Jul 28 , 2024 | 04:38 AM