Share News

Delhi : 7 వేల కోట్లతో సైన్యానికి ఆయుధాలు

ABN , Publish Date - Aug 23 , 2024 | 04:38 AM

భారత సైన్యం ఆయుధ సంపత్తిని పెంచేలా శక్తిమంతమైన, తేలికపాటి ఆర్టిలరీ గన్స్‌ కొనుగోలు దిశగా కీలక ముందడుగు పడింది. దేశీయంగా అభివృద్ధి చేసి, తయారు చేసే తర్వాతి తరం ఆర్టిలరీ గన్స్‌ కొనుగోలు కోసం భారత సైన్యం టెండరు జారీ చేసింది.

Delhi : 7 వేల కోట్లతో సైన్యానికి ఆయుధాలు

  • తర్వాతి తరం ఆర్టిలరీ గన్స్‌ కోసం టెండరు

న్యూఢిల్లీ, ఆగస్టు 22: భారత సైన్యం ఆయుధ సంపత్తిని పెంచేలా శక్తిమంతమైన, తేలికపాటి ఆర్టిలరీ గన్స్‌ కొనుగోలు దిశగా కీలక ముందడుగు పడింది.

దేశీయంగా అభివృద్ధి చేసి, తయారు చేసే తర్వాతి తరం ఆర్టిలరీ గన్స్‌ కొనుగోలు కోసం భారత సైన్యం టెండరు జారీ చేసింది.

తొలిదశలో సైన్యానికి 400 యూనిట్లు అవసరమని, పాత ఆయుధాలను మార్చడం ద్వారా ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కాంట్రాక్టు విలువ ఆధారంగా 50 శాతానికిపైగా స్వదేశీ పరికరాలతో ఈ ఆర్టిలరీ గన్‌లను భారత్‌లోనే రూపొందించాలని ఒప్పందంలో పేర్కొన్నారు.

రూ.7000 కోట్ల విలువైన ఈ భారీ ప్రాజెక్టుపై లార్సన్‌ అండ్‌ టూబ్రో, భారత్‌ ఫోర్జ్‌, టాటా అడ్వాన్స్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ వంటి ప్రైవేటు రక్షణ రంగ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి.

Updated Date - Aug 23 , 2024 | 04:38 AM