Share News

Delhi : సీఏఏ పత్రాలపై ప్రభుత్వ వివరణ

ABN , Publish Date - Aug 10 , 2024 | 05:23 AM

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద జారీ చేసిన నిబంధనల పరిధిని కేంద్రం విస్తరించింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అప్ఘానిస్థాన్‌ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి భారత పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది.

Delhi : సీఏఏ పత్రాలపై ప్రభుత్వ వివరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 9: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద జారీ చేసిన నిబంధనల పరిధిని కేంద్రం విస్తరించింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అప్ఘానిస్థాన్‌ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి భారత పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది.

దరఖాస్తుదారుల తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతల్లో ఒకరు ఈ మూడు దేశాల్లో ఒకదాని పౌరుడని, లేదా ఆ దేశంలో నివసించారని రుజువు చేస్తూ భారత్‌లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేక పాక్షిక న్యాయసంస్థలు జారీ చేసిన ఏదైనా డాక్యుమెంట్‌ ఉండొచ్చని కేంద్ర హోంశాఖ తాజాగా ప్రకటించింది.

దీనికి సంబంధించిన భూ రికార్డులు గానీ, న్యాయపరమైన ఉత్తర్వు తదితరాలను ఆమోదిస్తామని తెలిపింది.

Updated Date - Aug 10 , 2024 | 05:24 AM