Share News

Delhi : చంపేస్తారేమోనని భయమేస్తోంది: సౌదీ యువరాజు

ABN , Publish Date - Aug 17 , 2024 | 03:13 AM

ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం తన ప్రాణాల మీదకు తెస్తోందని అమెరికా చట్ట సభ్యుల ముందు సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Delhi : చంపేస్తారేమోనని భయమేస్తోంది: సౌదీ యువరాజు

న్యూఢిల్లీ, ఆగస్టు 16: ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం తన ప్రాణాల మీదకు తెస్తోందని అమెరికా చట్ట సభ్యుల ముందు సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పాలస్తీనా ఆందోళనలు పట్టించుకోకుండా సౌదీఅరేబియా-ఇజ్రాయెల్‌ మధ్య సంబంధాలను సాధారణస్థితికి తీసుకొస్తే.. తనను చంపుతారేమోనని భయమేస్తోందంటూ వాపోయారు.

ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం చేసుకుని ఉగ్రవాదుల చేతుల్లో హత్యకు గురైన ఈజిప్టు మాజీ అధ్యక్షుడు అన్వర్‌ సాదత్‌ విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. సాదత్‌ భద్రత విషయమై ఆనాడు అమెరికా ఏం చర్యలు తీసుకుందని ఆయన ఆరా తీసినట్లు ఆ దేశ డిజిటల్‌ వార్తాపత్రిక ‘పొలిటికో’ పేర్కొంది.

అయితే తనకు ప్రాణభయమున్నప్పటికీ ఇజ్రాయెల్‌తో సంబంధాల విషయంలో తాను ముందుకెళ్లడానికే నిశ్చయించుకున్నట్లు సౌదీ యువరాజు స్పష్టం చేశారు.

Updated Date - Aug 17 , 2024 | 03:13 AM