Share News

Delhi : ఈ స్వాతంత్య్ర దినోత్సవ థీమ్‌ ‘వికసిత్‌ భారత్‌’

ABN , Publish Date - Jul 20 , 2024 | 05:13 AM

భారత 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల థీమ్‌గా ‘వికసిత్‌ భారత్‌’ను ఎంపిక చేసినట్లు అధికారులు ప్రకటించారు. 2047 నాటికి భారత్‌ను ‘అభివృది చెందిన దేశం’గా మార్చే ధేయ్యంతో ఈ థీమ్‌ను రూపొందించారు.

Delhi : ఈ స్వాతంత్య్ర దినోత్సవ థీమ్‌ ‘వికసిత్‌ భారత్‌’

న్యూఢిల్లీ, జూలై 19: భారత 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల థీమ్‌గా ‘వికసిత్‌ భారత్‌’ను ఎంపిక చేసినట్లు అధికారులు ప్రకటించారు. 2047 నాటికి భారత్‌ను ‘అభివృది చెందిన దేశం’గా మార్చే ధేయ్యంతో ఈ థీమ్‌ను రూపొందించారు.ఈ మేరకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి భరత్‌ భూషణ్‌ బాబు శుక్రవారం తెలిపారు.

‘‘2047 నాటికి దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి వంద సంవత్సరాలు పూర్తవుతాయి. నాటికి ‘అభివృద్ధి చెందిన దేశం’గా అవతరించడానికి భారత్‌ కాంక్షిస్తోంది’’ అని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. అలాగే ఎర్రకోటతో పాటు ‘వికసిత్‌ భారత్‌’ నినాద పోస్టర్‌ను షేర్‌ చేశారు.

Updated Date - Jul 20 , 2024 | 05:13 AM