Share News

Delhi : అమెరికాలో భారత రాయబారిగా వినయ్‌ క్వాత్రా

ABN , Publish Date - Jul 20 , 2024 | 06:13 AM

అమెరికాలో భారత రాయబారిగా విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి వినయ్‌ క్వాత్రా శుక్రవారం నియమితులయ్యారు. ఆయన ఆదివారమే కార్యదర్శిగా పదవీ విరమణ చేయడం గమనార్హం.

Delhi : అమెరికాలో భారత రాయబారిగా వినయ్‌ క్వాత్రా

న్యూఢిల్లీ, జూలై 19: అమెరికాలో భారత రాయబారిగా విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి వినయ్‌ క్వాత్రా శుక్రవారం నియమితులయ్యారు. ఆయన ఆదివారమే కార్యదర్శిగా పదవీ విరమణ చేయడం గమనార్హం. త్వరలోనే ఆయన కొత్త బాధ్యతలు చేపడుతారని విదేశాల వ్యవహారాల శాఖ ప్రతినిధి తెలిపారు. క్వాత్రా 2022 మే నెల ఒకటో తేదీ నుంచి ఈ నెల 14 వరకు విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. 1993 నుంచి 2003 వరకు న్యూఢిల్లీలోని విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయంలో ఐక్యరాజ్యసమితి వ్యవహారాలను చూసేవారు. ఆయన 2015 నుంచి 2017 వరకు ప్రధాని కార్యాలయం (పీఎంఓ)లో జాయింట్‌ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు.

Updated Date - Jul 20 , 2024 | 06:13 AM