Share News

Lok Sabha Elctions: ఐదు విడతల్లోనే మూడోసారి మా సర్కర్ ఖాయమైంది: మోదీ

ABN , Publish Date - May 22 , 2024 | 03:13 PM

లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఐదు విడతలు పూర్తయ్యే సరికి మూడోసారి మోదీ సర్కార్ అధికారంలోకి రావడం ఖాయమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీలో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు.

Lok Sabha Elctions: ఐదు విడతల్లోనే మూడోసారి మా సర్కర్ ఖాయమైంది: మోదీ

బస్తి: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఐదు విడతలు పూర్తయ్యే సరికి మూడోసారి మోదీ సర్కార్ అధికారంలోకి రావడం ఖాయమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీలో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, కాంగ్రెస్, సమాజ్‌వాదీ యువరాజులు (Shehzadas)కలిసి యూపీలో 79 సీట్లు గెలుస్తామంటూ వదంతులు సృష్టిస్తూ, పగటి కలలు కంటున్నారని అన్నారు. జూన్ 4వ తేదీన ప్రజలే వారిని మేలుకొలుపుతారని, అప్పుడు ఈవీఎంలను నిందిస్తూ గగ్గోలు మొదలుపెడతారని విమర్శించారు.


"తరచు మనలను బెదరించే ఉగ్రవాద దేశమైన పాకిస్థాన్ ఇప్పుడు అతలాకుతలమైంది. ఇప్పుడు ఇండియాను కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ బెదిరించే ప్రయత్నం చేస్తున్నాయి. పాకిస్థాన్‌ను చూసి మనం భయపడాలని వారు చెబుతున్నారు'' అని మోదీ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ సభలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొని ప్రసంగించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 22 , 2024 | 03:13 PM