Share News

Mandya Lok Sabha Result: 2.8 లక్షల ఆధిక్యంతో కుమారస్వామి గెలుపు

ABN , Publish Date - Jun 04 , 2024 | 05:43 PM

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ సెక్యులర్ నేత హెచ్‌డీ కుమారస్వామి మాండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణే గౌడపై 2.84 లక్షల భారీ ఆధిక్యంతో గెలిచారు.

Mandya Lok Sabha Result: 2.8 లక్షల ఆధిక్యంతో కుమారస్వామి గెలుపు

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) నేత హెచ్‌డీ కుమారస్వామి (HD Kumaraswamy) మాండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణే గౌడపై 2.84 లక్షల భారీ ఆధిక్యంతో గెలిచారు. కుమారస్వామికి 8,51,881 ఓట్లు రాగా, గౌడకు 5,67,261 ఓట్లు పోలయ్యాయి. కర్ణాటకలోని 28 లోక్‌సభ స్థానాల్లో ఒక కీలక నియోజకవర్గంగా మాండ్య ఉంది. ఏప్రిల్ 26న రెండో దశ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మాండ్యలో పోలింగ్ జరిగింది.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 04 , 2024 | 05:43 PM